విజయవంతమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స


సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో ఓ మహిళకు డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలోని వైద్యుల బృందం నిర్వహించిన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన 46 ఏళ్ల పద్మ అనే మహిళకు ఇవాళ వైద్యులు చేసిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. సుమారు ఆరు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి మహిళకు గుండెను విజయవంతంగా అమర్చగలిగారు. ఆమెకు అమర్చిన గుండెను బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించి ఇవాళ ప్రత్యేక విమానంలో నగరానికి తరలించిన విషయం తెలిసిందే. యశోదాలో ఇది రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్స.


Followers