తెలంగాణలో కొత్తగా గ్రూప్-3 పోస్టులు

రాష్ర్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిన 15,222 ఉద్యోగుల భర్తీకి చురుగ్గా సన్నాహాలు జరుగుతున్నాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్టుల విభజన, విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రూప్‌-1 కేటగిరీలో డిప్యూటీ కలెక్టర్‌ నుంచి ఎంపీడీవో వరకు 20 రకాల పోస్టులను భర్తీ చేస్తారు. గ్రూప్‌-1కు 1000 మార్కులతో మెయిన్స్‌ పరీక్ష నిర్వహించనున్నారు. మెయిన్స్ లో కొత్తగా పేపర్‌ -6ని ప్రవేశపెడుతున్నారు. ఇందులో తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు సిలబస్‌ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్‌-2 లో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహశీల్దార్ సహా 12 రకాల పోస్టులుంటాయని పేర్కొంది. ఈ పరీక్షను 675 మార్కులకు నిర్వహిస్తుంది. మరో 17 రకాల పోస్టులతో గ్రూప్‌-3 ని కొత్తగా ఏర్పాటు చేసింది.

Followers