Showing posts with label Current Affairs. Show all posts
Showing posts with label Current Affairs. Show all posts

నోబెల్‌ రేసులో రఘురాం రాజన్‌

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కార గ్రహీతల రేసులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్లారివేట్‌ అనలిటిక్స్‌ విడుదల చేసిన జాబితాలో రాజన్‌ పేరు కూడా ఉంది. భౌతిక, రసాయన, వైద్యం, సాహిత్యం, శాంతి, ఆర్థిక రంగంలో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్‌ పురస్కారాలు అందిస్తారు. 2017గానూ ఇప్పటికే ఐదు రంగాల్లో అవార్డులను ప్రకటించగా.. అక్టోబర్‌ 9 సోమవారం ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారం ప్రకటించనున్నారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో జరిగే కార్యక్రమంలో గ్రహీత పేరును వెల్లడిస్తారు. అయితే ఈసారి నోబెల్‌ గ్రహీతల రేసులో రాజన్‌ కూడా ఉన్నారట.
క్లారివేట్‌ అనలిటిక్స్‌ అనే సంస్థ నోబెల్‌ అవార్డులపై అధ్యయనం చేస్తుంది. నోబెల్‌ కమిటీ అధికారికంగా ప్రకటించడానికి కొద్ది రోజుల ముందు గ్రహీతల రేసులో ఉన్నవారితో జాబితాను రూపొందిస్తుంది. దీని ప్రకారం.. ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో పురస్కారం అందుకోబోయే రేసులో ఆరుగురు ఉండగా.. అందులో ఒకరు ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రాజన్‌ కావడం విశేషం. ఈ మేరకు క్లారివేట్‌ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. గత 15ఏళ్లుగా క్లారివేట్‌ ఎంపిక చేసిన 45 మందికి నోబెల్‌ పురస్కారాలు వరించాయి. ఒక ఏడాది అయితే ఏకంగా క్లారివేట్‌ జాబితాలోని 9 మంది నోబెల్‌ అందుకున్నారు.
మూడేళ్ల పాటు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రాజన్‌ సెప్టెంబర్‌ 4, 2016న పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్థికవేత్త అయిన రాజన్‌ ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేశారు. పుస్తకాలు రాశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

రియో పారా ఒలింపిక్స్


బ్రెజిల్‌లోని రియో నగరంలో ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు 15వ పారాలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఒలింపిక్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ పారాలింపిక్స్‌ను నిర్వహించారు. శారీరక అంగవైకల్యం, పాక్షిక అంధత్వం, పక్షవాతం కలిగిన అథ్లెట్‌లు పారాలింపిక్స్‌లో పాల్గొంటారు. భారత్ 1968 నుంచి (1976, 1980 తప్ప ) పారాలింపిక్స్‌లో పాల్గొంటూ వస్తోంది. రియోలో జరిగిన పారాలింపిక్స్‌తో కలిపి మొత్తం 11 పారాలింపిక్స్‌లలో భారత్ పాల్గొన్నది. రియో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి భారత అథ్లెట్‌లు నానా కష్టాలు పడ్డారు. పతకం తెస్తారని ఆశలు పెట్టుకున్న క్రీడాకారులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా వెనుదిరుగుతూ నిరాశపరిచారు. అయితే పారాలింపిక్స్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. సకల సౌకర్యాలు ఉండి, అత్యుత్తమ శిక్షణ పొందిన అతిపెద్ద క్రీడాబృందం నిరాశపరిచిన వేదికపైనే భారత దివ్యాంగుడు మరియప్పన్ తంగవేలు అద్భుతం చేశాడు. హైజంప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. దేవేంద్ర జఝారియా జావెలిన్ త్రో వ్యక్తిగత విభాగంలో రెండోసారి స్వర్ణం సాధించడంతోపాటు ప్రపంచ రికార్డులు నెలకొల్పా డు. మహిళా అథ్లెట్ దీపా మాలిక్ షాట్‌పుట్‌లో రజతం సాధించారు. వైకల్యాన్ని జయించి ప్రపంచ క్రీడా వేదికపై సత్తాచాటారు మన పారా అథ్లెట్‌లు. 11 రోజులపాటు ఉత్సాహంగా సాగిన పారాలింపిక్స్‌లో చివరిరోజు విషాదం చోటుచేసుకుంది. ఇరాన్ అథ్లెట్ బహ్మాన్ గోల్బార్నిజాద్.. సైక్లింగ్ రేసులో ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.

పారాలింపిక్స్ విశేషాలు


-ఆరంభం, ముగింపు వేదిక - మారకాన స్టేడియం (బ్రెజిల్)
-క్రీడలు జరిగిన తేదీలు - సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు
-మొత్తం జరిగిన రోజులు - 11
-క్రీడా ప్రారంభకులు - మైఖేల్ టైమర్ (బ్రెజిల్ అధ్యక్షుడు)
-మస్కట్ - వీనిసియస్, టామ్
-నినాదం - ఒక కొత్త ప్రపంచం
-పాల్గొన్న దేశాలు - 159 + ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-పాల్గొన్న క్రీడాకారులు - 4,342
-క్రీడలు - 22
-క్రీడా విభాగాలు - 528
-మొత్తం స్వర్ణాలు - 529
-మొత్తం రజతాలు - 529
-మొత్తం కాంస్యాలు - 539
-మొత్తం పతకాలు - 1,597
-పారాలింపిక్స్‌లో చేర్చిన క్రీడలు - కనోయింగ్, ట్రయథ్లాన్
-మార్చ్‌పాస్ట్‌లో తొలి దేశం - ఇండిపెండెంట్ పారాలింపిక్స్ అథ్లెట్స్ టీమ్
-మార్చ్‌పాస్ట్‌లో భారత్ - 73వ దేశం
-మార్చ్‌పాస్ట్‌లో చివరి దేశం - బ్రెజిల్
-భారత్ నుంచి పాల్గొన్న క్రీడాకారులు - 19 మంది (16 మంది పురుషులు, ముగ్గురు మహిళలు)
-భారత్ పాల్గొన్న క్రీడలు - 5
-ప్రారంభ వేడుకల్లో భారత త్రివర్ణ పతాకధారి - దేవేందర్ (జావెలిన్ త్రోయర్)
-తొలి స్వర్ణ పతక విజేత - వెరోనికా (స్లోవేకియా) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో 208 స్కోర్‌తో స్వర్ణం సాధించింది.
-అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశం - చైనా (107)
-అత్యధిక పతకాలు సాధించిన దేశం - చైనా (107 స్వర్ణాలు, 81 రజతాలు, 51 కాంస్యాలు = మొత్తం 239 పతకాలు)
-తొలి పతకం సాధించిన భారత క్రీడాకారుడు - మరియప్పన్ తంగవేలు (తమిళనాడు), హైజంప్
-భారత్ సాధించిన పతకాలు - 4 (2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యం)
-పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన దేశాలు - 63
-ఏదో ఒక పతకం సాధించిన దేశాలు - 83
-ఒక్క పతకం కూడా సాధించని దేశాలు - 76
-పతకాల సాధనలో బ్రెజిల్ స్థానం - 8
2 పతకాల సాధనలో భారత్ స్థానం - 43
-16వ పారాలింపిక్స్ క్రీడలను నిర్వహించేది - జపాన్ (టోక్యో)
-అంతర్జాతీయ పారాలింపిక్స్ ఏర్పడినది - 1989, సెప్టెంబర్ 22
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం గౌరవ అధ్యక్షుడు - జాక్వెస్ రోగె
-అంతర్జాతీయ పారాలింపిక్స్ సంఘం అధ్యక్షుడు - ఫిలిప్ క్రావెన్
-భారత పారాలింపిక్స్ సంఘం ఏర్పడినది - 1992
-సంఘం అధ్యక్షుడు - రాజేష్ తోమర్
-సంఘం ప్రధాన కార్యదర్శి - జె. చంద్రశేఖర్

పారాలింపిక్స్ - 2016 ప్రత్యేకతలు


-పారాలింపిక్స్ చిహ్నం టామ్. బ్రెజిల్ వాయిద్యకారుడు టామ్ జొబిమ్‌కు గుర్తుగా ఈ చిహ్నానికి ఆ పేరు పెట్టారు. బ్రెజిల్‌లోని వృక్ష సంపదను ప్రతిబింబిస్తూ ఈ చిహ్నాన్ని రూపొందించారు.

-ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ లేకుండా పారాలింపిక్స్ ప్రారంభమయ్యాయి. ఎందుకంటే ఆయన పశ్చిమ జర్మనీ మాజీ అధ్యక్షుడు వాల్టర్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి వెళ్లాడు.

-డోపింగ్ ఆరోపణల వల్ల రష్యా అథ్లెట్లు ఈ పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.

-పారాలింపిక్స్ ప్రారంభోత్సవం, ముగింపు వేడుకలను భారత్‌లో దూరదర్శన్ సహా ఏ నెట్‌వర్క్ కూడా ప్రసారం చేయలేదు. అయితే 154 దేశాలు వేడుకలను ప్రసారం చేశాయి.

-పారాలింపిక్స్‌లో స్వర్ణ విజేతలకు రూ. 75 లక్షలు, రజత పతక విజేతకు రూ. 50 లక్షలు, కాంస్య పతక విజేతకు రూ. 30 లక్షలు ఇస్తామని క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మరియప్పన్ (21) :

తమిళనాడులోని సేలం సమీపంలో పెరియవాడగంపట్టి గ్రామంలో 1995, జూన్ 28న జన్మించిన మరియప్పన్ తంగవేలు.. ఐదేళ్ల వయసులో పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ బస్సు అతడి కాలుపై నుంచి వెళ్లింది. ప్రమాదంలో అతడి కుడికాలు ఛిద్రమైంది. మరియప్పన్ తల్లి వైద్యం కోసం రూ.3,00,000 ఖర్చు చేసింది. పేద కుటుంబం కావడంతో ఆమె కూరగాయలు అమ్ముతూ ఇప్పటికీ ఆ అప్పు చెల్లిస్తోంది. పారాలింపిక్స్ విజయంతో తమిళనాడు ప్రభుత్వం తంగవేలుకు రూ. 2 కోట్లు ప్రకటించింది. భారత ఒలింపిక్ సంఘం రూ.75 లక్షలు ఇవ్వనుంది. దీంతో వారి ఆర్థిక కష్టాలన్నీ తీరినట్లే. మరియప్పన్ తంగవేలు 14వ ఏట తొలిసారి ఎలాంటి శారీరక వైకల్యం లేని వారితో నేషనల్ అథ్లెటిక్ మీట్‌లో పాల్గొని రజతం గెలిచాడు. 2013లో 18 ఏళ్ల వయసులో జాతీయ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేటప్పుడు కోచ్ సత్యనారాయణ.. మరియప్పన్ ప్రతిభను గుర్తించాడు. బెంగళూరులో కఠోర సాధన, శిక్షణతో రాటుదేలి ఏడాది క్రితం సీనియర్ లెవల్ పోటీల్లో అడుగుపెట్టిన మరియప్పన్ అదే ఏడాది ట్యునీషియాలో జరిగిన పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిలో 1.78 మీటర్ల ఎత్తు ఎగిరి స్వర్ణం గెలిచాడు. పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఇప్పుడు రియో పారాలింపిక్స్‌లో హైజంప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాడు.

దేవేందర్ జఝారియా (35) :

రాజస్థాన్‌లో 1981, జూన్ 10న జన్మించిన దేవేందర్ జఝారియా 8 ఏళ్ల ప్రాయంలో చెట్టు ఎక్కగా కరెంట్ వైరు తగలడంతో షాక్‌కు గురై ఎడమ చేతిని కోల్పోయాడు. అంగవైకల్యం వచ్చిందని కుంగిపోకుండా జావెలిన్ త్రోలో కఠోర సాధనచేసి 2004, 2016 పారాలింపిక్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించాడు. 2013లో ఫ్రాన్స్‌లోని లయోన్‌లో, 2015లో ఖతార్‌లోని దోహలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో వరుసగా స్వర్ణం, రజతం సాధించాడు. 2004లో అర్జున అవార్డు పొందాడు. 2012లో పద్మశ్రీ అవార్డు స్వీకరించి, ఆ అవార్డు అందుకున్న తొలి పారాలింపియన్‌గా గుర్తింపు పొందాడు.

దీపామాలిక్ :

హర్యానాకు చెందిన దీపామాలిక్ మహిళల షాట్ పుట్ విభాగంలో రజతం సాధించారు. ఈ ఘనతతో పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా దీప రికార్డు సృష్టించారు. దీపా మాలిక్ 2011లో న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చిలో జరిగిన ఐపీసీ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో షాట్‌పుట్‌లో రజతం గెలుపొందా రు. ఆమె పట్టుదలను చూసి సైనికాధికారి అయిన భర్త ప్రోత్సాహం తోడవడంతో దీప ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 2012లో అర్జున అవార్డు అందుకున్నా రు. 1999లో వెన్నెముకకు కణితి రావడంతో దీప శరీరంలోని నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. దీంతో ఆరేళ్లపాటు చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె ఆ తర్వాత పారా అథ్లెట్‌గా మారారు. దీప పేరుమీద రెండు లిమ్కా బుక్ రికార్డులు ఉన్నాయి. మొదటిది 2008లో కిలోమీటరు దూరం యమునా నది ప్రవాహాన్ని దాటడం. రెండోది 2013లో ప్రత్యేక బైక్‌పై 58 కిలోమీటర్లు ప్రయాణించడం.

వరుణ్ సింగ్ భాటి:

1995, ఫిబ్రవరి 13న ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన వరుణ్‌సింగ్ భాటి (21) పోలియో రావడంతో వికలాంగుడిగా మారాడు. 2012లో లండన్‌లో జరిగిన పారాఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయాడు. 2014లో దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్ పారాలింపిక్స్‌లో 5వ స్థానం, అదే ఏడాది చైనాలో జరిగిన ఓపెన్ అథ్లెట్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించాడు. 2015లో జరిగిన పారా ప్రపంచ చాంపియన్ పోటీల్లో 5వ స్థానంలో నిలిచాడు. రియోలో జరిగిన పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో కాంస్యం సాధించాడు.

బహ్మాన్ గోల్బార్నిజాద్:

ఇరాన్‌కు చెందిన ఈ సైక్లిస్ట్ 1980లో జరిగిన యుద్ధంలో కాలు కోల్పోయాడు. ఈ పారాలింపిక్స్‌లో పురుషుల రోడ్ రేస్ సీ-4, 5 విభాగాల్లో పాల్గొన్న బహ్మాన్ సైకిల్‌పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలిస్తున్న తరుణంలో గుండెపోటుతో మృతిచెందాడు. ఇలా పారా ఒలింపిక్స్‌లో ఒక అథ్లెట్ మరణించడం ఇదే మొదటిసారి. బహ్మాన్ మృతికి సంతాప సూచకంగా రియో ముగింపు వేడుకల్లో కొన్ని క్షణాలు మౌనం పాటించారు.

పారాలింపిక్స్‌లో పెను సంచలనం


నలుగురు పారా అథ్లెట్లు ఏ వైకల్యం లేని ఆటగాళ్లని తలదన్నేలా పరుగెత్తి ప్రపంచాన్ని నివ్వెరపరిచారు. 1500 మీ. (టీ-13 క్లాస్) పరుగులో తొలి నాలుగు స్థానా ల్లో నిలిచిన అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ కంటే అత్యుత్తమ టైమింగ్‌ను నమోదు చేశారు. అబ్దెల్లతీఫ్ బాకా (అల్జీరియా) 3 నిమిషాల 48.29 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తిచేసి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. ఇథియోపియాకు చెందిన తమిరు డొమిసెస్ (3 నిమిషాల 48.59 సెకన్లు) రజతం సాధించగా, కెన్యాకు చెందిన హెన్రీ కిర్వా (3 నిమిషాల 49.59 సెకన్లు) కాంస్యం గెలుచుకున్నాడు. అబ్దెల్లతీఫ్ సోదరుడు ఫౌద్‌బాకా (3 నిమిషాల 49.84 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ నలుగురు పారా అథ్లెట్లు.. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన అమెరికా రన్నర్ మాథ్యూ సెంట్రోవిజ్ (3 నిమిషాల 50 సెకన్లు) కంటే వేగంగా రేసును పూర్తిచేశారు.

-జర్మనీకి చెందిన మార్సర్ రెమ్ కృత్రిమ కాలుతో లాంగ్‌జంప్‌లో 8.40 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. ఒలింపిక్స్‌లో అమెరికా అథ్లెట్ జెఫ్ హెండర్సన్ 8.38 మీటర్లు దూకి స్వర్ణం సాధించాడు. హెండర్సన్ కంటే మార్సర్ దూకిన ఎత్తు ఎక్కువ కావడం విశేషం.

పారాలింపిక్స్‌లో భారత్


-మొదటిసారి 1968లో పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-మధ్యలో జరిగిన 1976, 1980 పారాలింపిక్స్‌లో పాల్గొనలేదు.
-ఇప్పటివరకు 11 సార్లు పారాలింపిక్స్‌లో పాల్గొన్నది.
-1972 పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం వచ్చిం ది. మురళీకాంత్ షెట్కర్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు.

-రియో పారాలింపిక్స్‌లో షాట్ పుట్ విభాగంలో దీపా మాలిక్ రజతం సాధించారు. ఈమె పారాలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళ.
-వ్యక్తిగత విభాగంలో రెండు పారాలింపిక్స్‌లో (2004, 2016) స్వర్ణాలు సాధించిన అథ్లెట్ దేవేందర్ జఝారియా (జావెలిన్ త్రో).
-జోగిందర్‌సింగ్ బేడీ వ్యక్తిగత విభాగంలో ఒకే పారాలింపిక్స్‌లో వేర్వేరు క్రీడల్లో మూడు పతకాలు సాధించాడు. న్యూయార్క్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో రజతం (షాట్ పుట్), కాంస్యం (జావెలిన్ త్రో), కాంస్యం (డిస్కస్ త్రో) గెలుచుకున్నాడు.
-ఇప్పటి వరకు జరిగిన పారాలింపిక్స్‌లో భారత్‌కు 12 పతకాలు వచ్చాయి. వాటిలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి.
















Oscars Awards 2016


 Current Affirs 


Best Picture: Spotlight
»Best Actor in a Lead Role: Leonardo DiCaprio, The Revenant
»Best Actress in a Lead Role: Brie Larson, Room
»Best Director: Alejandro González Iñárritu, The Revenant
»Best Original Score: Ennio Morricone, The Hateful Eight
»Best Original Song: "Writings on the Wall," Spectre, Jimmy Napes and Sam Smith
»Best Foreign Language Film: Hungary, Son of Saul
»Best Live Action Short Film: Stutterer, Benjamin Cleary and Serena Armitage
»Best Documentary Feature: Amy, Asif Kapadia and James Gay-Rees
»Best Documentary Short Subject: A Girl in the River: The Price of Forgiveness, Sharmeen Obaid-Chinoy
»Best Actor in a Supporting Role: Mark Rylance, Bridge of Spies
»Best Animated Feature Film: Inside Out, Pete Docter and Jonas Rivera
»Best Animated Short Film: Bear Story, Gabriel Osorio and Pato Escala
»Best Visual Effects: Ex Machina, Andrew Whitehurst, Paul Norris, Mark Ardington and Sara Bennett
»Best Sound Mixing: Mad Max: Fury Road, Chris Jenkins, Gregg Rudloff and Ben Osmo
»Best Sound Editing: Mad Max: Fury Road, Mark Mangini and David White
»Best Film Editing: Mad Max: Fury Road, Margaret Sixel
»Best Cinematography: The Revenant, Emmanuel Lubezki
»Best Makeup and Hairstyling: Mad Max: Fury Road, Lesley Vanderwalt, Elka Wardega and Damian Martin
»Best Production Design: Mad Max: Fury Road
»Best Costume Design: Mad Max: Fury Road, Jenny Beavan
»Best Actress in a Supporting Role: Alicia Vikander, The Danish Girl
»Best Adapted Screenplay: The Big Short, Charles Randolph and Adam McKay
»Best Original Screenplay: Spotlight, Josh Singer and Tom McCarthy
»Jean Hersholt Humanitarian Award: Debbie Reynolds
»Honorary Oscar: Spike Lee
»Honorary Oscar: Gena Rowlands

జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం ?




జన్ ధన్ యోజనం - ఎంత ప్రయోజనం? 
    మంత్రాలకు చింతకాయలు రాలవు అన్నది సామెత. ప్రధాని ప్రకటించిన జన్ ధన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ప్రభుత్వ ప్రయోజనాలు ప్రజలకు చేరాలంటే బ్యాంకు ఖాతాలు తెరవాల్సిందేనని ఆయన నొక్కి వక్కాణించారు. ఆగస్టు 28న దేశ వ్యాపిత కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా కోటీ మందికిపైగా బ్యాంకు ఖాతాలు తెరిపించారు. అయితే ఈ ఖాళీ ఖాతాలతో ఏమిటి ప్రయోజనం అన్నదే ప్రధాన ప్రశ్న. ఇప్పటికే ఎన్నో ఎకౌంట్లు ఖాళీ గా వుండటం, వాటిని రద్దు చేసే విషయాన్ని బ్యాంకులు పరిశీలిస్తున్నాయి. అయితే ఈ ఖాతాల వల్ల జీవిత భీమా, తదితర ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులు నేరుగా ఖాతాదారుల ఖాతాల్లోకి వచ్చి చేరుతాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే భవిష్యత్తులో ఈ ఖాతాల ద్వారా పేద ప్రజలకు ఏ మేరకు మేలు జరుగనుందో చూడాల్సి వుంది.
by: 10tv



ప్రపంచ వృద్ధుడి వయసు 111 ఏళ్లు


prapancha vruddhudi vayasu 111 ellu


టోక్యో : ప్రపంచంలో సజీవంగా ఉన్న వృద్ధు నిగా జపాన్‌ విద్యావేత్త సకరి మొమోయ్‌ గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈయనకు కవితలంటే మహా ఇష్టం. ఈయన వయసు 111 సంవత్సరా లు. గిన్నిస్‌ రికార్డుకు సంబంధించిన ధ్రువపత్రాన్ని బుధవారం ఆయన స్వీకరించారు. ఏప్రిల్‌లో మరణించిన న్యూయార్క్‌కు చెందిన అలెగ్జాండర్‌ ఇమిచ్‌ తర్వాత మొమోయ్‌ ఈ రికార్డు సాధించారు. అలెగ్జాండర్‌ 111 ఏళ్ల 164 రోజులు జీవించారు. ప్రపంచంలో అత్యధిక వయసుగల జీవించి ఉన్న మహిళ కూడా జపాన్‌కు చెందినవారే. మిసావో ఒకావా ఈ రికార్డు సాధించారు. ఒసాకాకు చెందిన ఆమె వయసు 116 సంవ త్సరాలు. మొమోయ్‌ 1903 ఫిబ్రవరి ఐదున ఫుకుషిమా ప్రిఫెక్చర్‌లో జన్మించారు. అక్కడే ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించేవారు. కొంతకాలానికి టోక్యోకు ఉత్తరంగా ఉన్న సైతామాఅనే పట్టణానికి వెళ్లి హైస్కూలు ప్రిన్సిపాల్‌గా పని చేసి, పదవీ విరమణ చేశారు. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా చైనా కవితలంటే ఆసక్తి ఎక్కువ అని చెప్పారు.

దేశంలో తొలి మోనోరైలు

దేశంలోనే మొట్టమొదటి మోనో రైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2014 ఫిబ్రవరి 1న వడాలా డిపోలో రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. 2014, ఫిబ్రవరి 2 నుంచి మోనోరైలు సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. రూ. 3,000 కోట్ల వ్యయమయ్యే ఈ మోనోరైలు ప్రాజెక్టును రెండు దశల్లో అమలు చేస్తున్నారు. మొదటి దశలో .9 కి.మీ. దూరం మేర వడాలా డిపో చెంబూరు సెక్షన్‌ను ప్రారంభించారు. రెండో దశలో వడాలా డిపోనుంచి దక్షిణ ముంబైలోని సంత్ గార్డెన్ మహారాజ్ చౌక్ వరకు విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ మలేషియాకు చెందిన స్కోమి ఇంజినీరింగ్ సంస్థతో కూడిన కన్సార్టియం చేపట్టింది. మోనోరైలు నిర్వహణను ముంబాయి మెట్రోపాలిటన్ రీజియస్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు కేటాయించిన రూ. 3,000 కోట్లలో ఇప్పటికే రూ. 1,900 కోట్లను ఎంఎంఆర్‌డీఏ వ్యయం చేసింది. దూరాన్ని బట్టి రూ.5 నుంచి 11 వరకు ప్రయాణ చార్జీలు వసూలు చేస్తారు. టికెట్ ధరను అధికారులు నిర్ణయిస్తారు. మొదటి దశలో ఆరు మోనో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. మరో పది రైళ్లు రెండో దశలో అందుబాటులోకి రానున్నాయి. మోనో రైలు ప్రత్యేకతలు -ఒక బోగీలో 20 మంది కూర్చొని, 130 మంది నిల్చుని ప్రయాణించే వీలుంది. మొత్తం నాలుగు బోగీల్లో ఒకేసారి 600 మంది ప్రయాణించవచ్చు. ఒక్క గంటలో సుమారు 20 వేల మందికి పైగా ప్రయాణించవచ్చు. -రైలు మార్గం పొడవు .93 కిలోమీటర్లు. వేగం గంటకు గరిష్టంగా 0 కిలోమీటర్లు. -మెట్రో రైలుతో పోల్చితే మోనో రైలు నిర్మాణ వ్యయం చాలా తక్కువ. -నగరాల్లో రోడ్ల విస్తరణకు స్థలం లభించని సమయంలో మోనోరైలు చాలా తక్కువ స్థలంలో పరిగెత్తనున్నాయి. ముఖ్యంగా భూమికి 20 నుంచి 30 అడుగుల ఎత్తుపై నుంచి వెళ్లే ఈ రైళ్లు రోడ్ల మధ్య ఉండే డివైడర్లపై ఒకే ఒక్క స్తంభంపై రెండు రైళ్లు పరిగెత్తేందుకు వీలుగా రైలు మార్గం ఏర్పాటు చేయవచ్చు. -మెట్రో రైళ్లు సాధారణంగా సమాంతరంగా ఉండే రెండు పట్టాలపై నడుస్తాయి. మోనో రైలుకు ఒకే పట్టా ఉంటుంది. పట్టా వెడల్పు కూడా రైలు కంటే తక్కువగా ఉంటుంది. తొలుత జర్మనీలో మోనో రైళ్లు ప్రారంభమయ్యాయి. జపాన్‌లో 1950లలో ఇవి ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ సమస్యనుంచి గట్టేక్కేందుకు జపాన్ వీటిని వాడుకలోకి తెచ్చింది

Present Cabinet Ministers in India



Present Cabinet Ministers
Serial Number
Portfolio
Name of Minister
1.
Prime Minister and also In-Charge of the Ministries/Departments viz:
Ministry of Personnel, Public Grievances & Pensions;
Ministry of Planning;
Ministry of Water Resources;
Department of Atomic Energy; and
Department of Space
Dr. Manmohan Singh
2.
Minister of Finance
Shri Pranab Mukherjee
3.
Minister of Agriculture and Minister of Consumer Affairs, Food & Public Distribution
Shri Sharad Pawar
4.
Minister of Defence
Shri A.K. Antony
5.
Minister of Home Affairs
Shri P. Chidambaram
6.
Minister of Railways
Km. Mamata Banerjee
7.
Minister of External Affairs
Shri S.M. Krishna
8.
Minister of Steel
Shri Virbhadra Singh
9.
Minister of Heavy Industries and Public Enterprises
Shri Vilasrao Deshmukh
10.
Minister of Health and Family Welfare
Shri Ghulam Nabi Azad
11.
Minister of Power
Shri Sushil Kumar Shinde
12.
Minister of Law and Justice
Shri M. Veerappa Moily
13.
Minister of New and Renewable Energy
Dr. Farooq Abdullah
14.
Minister of Urban Development
Shri S. Jaipal Reddy
15.
Minister of Road Transport and Highways
Shri Kamal Nath
16.
Minister of Overseas Indian Affairs
Shri Vayalar Ravi
17.
Minister of Textiles
Shri Dayanidhi Maran
18.
Minister of Communications and Information Technology
Shri A. Raja
19.
Minister of Petroleum and Natural Gas
Shri Murli Deora
20.
Minister of Information and Broadcasting
Smt. Ambika Soni
21.
Minister of Labour and Employment
Shri Mallikarjun Kharge
22.
Minister of Human Resource Development
Shri Kapil Sibal
23.
Minister of Mines and Minister of Development of North Eastern Region
Shri B.K. Handique
24.
Minister of Commerce and Industry
Shri Anand Sharma
25.
Minister of Rural Development and Minister of Panchayati Raj
Shri C.P. Joshi
26.
Minister of Housing and Urban Poverty Alleviation and Minister of Tourism
Kum. Selja
27.
Minister of Food Processing Industries
Shri Subodh Kant Sahay
28.
Minister of Youth Affairs and Sports
Dr. M.S. Gill
29.
Minister of Shipping
Shri G.K. Vasan
30.
Minister of Parliamentary Affairs
Shri Pawan K. Bansal
31.
Minister of Social Justice and Empowerment
Shri Mukul Wasnik
32.
Minister of Tribal Affairs
Shri Kantilal Bhuria
33.
Minister of Chemicals and Fertilizers
Shri M.K. Alagiri
 Update 15-12-2011


Tags: Present Cabinet Ministers in India ,Cabinet Ministers in India, Ministers in India

Nobel Prizes

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని పంచుకున్న బ్యూట్లర్, హాఫ్మన్, స్టీన్మన్ రోగనిరోధక వ్యవస్థలో పరిశోధనలకు దక్కిన గౌరవం


స్టాక్హోమ్, 2011 అక్టోబర్ 3: నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. కేన్సర్ సహా పలు రకాల వ్యాధుల చికిత్సలో సరికొత్త అవకాశాలను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలకు ఉమ్మడిగా వైద్యరంగంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. అమెరికాకు చెందిన బ్రూస్ బ్యూట్లర్, లగ్జెంబర్గ్కు చెందిన జూల్స్ హాఫ్మన్, కెనడాకు చెందిన రాల్ఫ్ స్టీన్మన్లు గౌరవాన్ని దక్కించుకున్నారు. రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన కీలక సిద్ధాంతాలను కనిపెట్టడం ద్వారా వీరు ముగ్గురూ విప్లవాత్మక కృషి చేశారని జ్యూరీ ప్రకటనలో తెలిపింది. బహుమతి గ్రహీతలలో ఒకరైన స్టీన్మన్ (68) గతనెల 30 పాంక్రియాటిక్ కేన్సర్తో మరణించారు. అయితే.. బహుమతి ప్రకటించిన కొద్ది గంటల తర్వాత గానీ, విషయం జ్యూరీకి తెలియలేదు. నిబంధనల ప్రకారం బహుమతిని మరణానంతరం ప్రకటించేందుకు వీల్లేదు. కానీ, బహుమతి ప్రకటించి తర్వాతే తమకు స్టీన్మన్ మృతి విషయం తెలిసిందని జ్యూరీకి నేతృత్వం వహించిన గెరాన్ హాన్సన్ తెలిపారు. కొత్తగా మరో విజేతను ప్రకటించేది లేదని, బహుమతి ఎలా ఇవ్వాలన్న విషయంలో నిబంధనలను పరిశీలిస్తామని అన్నారు. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల వచ్చే ఆస్థమా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, క్రాన్స్డిసీజ్ లాంటి వ్యాధులకు సరికొత్త మందులు కనిపెట్టేందుకు వీరి పరిశోధనలు ఉపయుక్తంగా ఉంటాయని జ్యూరీ వివరించింది. మొత్తం రూ. 7.1 కోట్ల బహుమతిలో సగం మొత్తాన్ని బ్యూట్లర్, హాఫ్మన్లు పంచుకుంటా రు. మిగిలిన సగం స్టీన్మన్కు వెళ్తుంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి డిసెంబర్ 10 స్టాక్హోమ్లో జరిగే కార్యక్రమంలో వీరు బహుమతులను అందుకుంటారు. కాగా.. ఆర్థిక, భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి విభాగాలలో నోబెల్ బహుమతులను త్వరలో ప్రకటించనున్నారు. అందులో భాగంగా నోబెల్ శాంతి బహుమతిని వచ్చే శుక్రవారం 7 తేదీన ఓస్లోలో ప్రకటిస్తారు. ఈసారి విభాగానికి రికార్డు స్థాయిలో 241 నామినేషన్లు వచ్చాయి. ఈసారి ట్యునీషియా, ఈజిప్ట్, లిబి యా, సిరియా, యెమెన్, బహ్రెయిన్ లాంటి ప్రాంతాల్లో వచ్చిన ప్రజాస్వామ్య విప్లవాన్ని ముందుండి నడిపించిన యోధులలో ఎవ రో ఒకరికి బహుమతి రావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వీరిలో ట్యునీషియాకు చెందిన బ్లాగర్ లీనా బెన్ మెన్నీకి దక్కే అవకాశం ఉందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇంటర్నెట్లో విప్లవాన్ని వ్యాప్తి చేయడంలో ఈమె కీలకపాత్ర పోషించారు. ఈజిప్టుకు చెందిన ఇస్రా అబ్దెల్ ఫతా, ఏప్రిల్ 6 నాటి ఉద్యమాలకు కూడా రావచ్చని అంచనా ఉంది. కైరోలోని తెహ్రీర్ స్క్వేర్ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన అహింసా ఉద్యమకర్త, గూగుల్ అధికారి వేల్ ఘోనిమ్ కూడా అవార్డు అందుకోడానికి అవకాశాలు ఉన్నాయంటున్నారు. గత సంవత్సరం జైల్లో న్న చైనా ఉద్యమకారుడు లియు జియబావోకు శాంతి హుమతి దక్కింది. నోబెల్ సాహిత్య బహుమతికి వినపడుతున్న పేర్లలో మన దేశానికి చెందిన విజయదాన్ డెతా పేరు కూడా ఉంది. పరిశోధనలు ఇవే శరీరంలోని రోగనిరోధక స్పందన వ్యవస్థలోని తొలి అంకా న్ని ప్రేరేపించే రిసెప్టర్ ప్రోటీన్లను బ్యూట్లర్, హాఫ్మన్ కనుగొన్నారు. శరీరంలోనే ఉండి ప్రమాదకరంగా పరిణమించే సూక్ష్మ జీవులను గుర్తించి వాటిపై దాడి చేయడంలో రోగనిరోధక వ్య వస్థకు సాయపడే డెండ్రిటిక్ కణాలను స్టీన్మన్ కనుగొన్నారు.


Tags:Nobel Prizes,nobel prize winners ,Nobal prize ceremony, obama nobel prize, nobal prize ceremony

Followers